ETV Bharat / state

బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజరోహణ పూజలు

author img

By

Published : Mar 16, 2021, 5:06 PM IST

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా వేదమంత్రాలు, మంగళవాద్యాలతో ధ్వజారోహణ పూజలు నిర్వహించారు.

yadadri brahmotsavam running grandly on second day in yadadri temple
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజరోహణ పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బాలాలయంలోని మండపంలో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ పూజలు కనుల పండువగా నిర్వహించారు.

yadadri brahmotsavam running grandly on second day in yadadri temple
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజరోహణ పూజలు

ధ్వజపటంపై గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు భక్తులకు అందజేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 15వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.

ఇదీ చూడండి: నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బాలాలయంలోని మండపంలో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ పూజలు కనుల పండువగా నిర్వహించారు.

yadadri brahmotsavam running grandly on second day in yadadri temple
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజరోహణ పూజలు

ధ్వజపటంపై గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ ముద్దలు భక్తులకు అందజేశారు. వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 15వ తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.

ఇదీ చూడండి: నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.