యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు పట్టణంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
స్వచ్ఛంద లాక్డౌన్కు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: రెండో డోసు కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు