యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కూరగాయల వ్యాపారులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంతకు... తుర్కపల్లి, మాదాపూర్ నుంచి వ్యాపారులు కూరగాయలు తీసుకొచ్చారు. కొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకు కూడా పోలీసులు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం