ఆర్టీసీ కార్మికుల బంద్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో ఎదుట కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బతుకమ్మ, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే ఏ ఒక్క బస్సును కూడా బయటకు రానీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికలు బంద్కు సీపీఐ, కాంగ్రెస్, భాజపా, పలు సంఘాలు మద్దతు పలికాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: '18 బిలియన్ డాలర్లకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యం'