ETV Bharat / state

అంగరంగ వైభవంగా ఏడోరోజు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 10, 2022, 7:31 PM IST

Yadadri Brahmotsavalu 2022: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏడో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నారసింహుడు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రిని సందర్శించనున్నారు.

Yadadri Brahmotsavalu
Yadadri Brahmotsavalu

Yadadri Brahmotsavalu 2022: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం.. జగన్మోహిని అలంకారంలో బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ నరసింహుడు భక్తులను కనువిందు చేశారు.

లోక కల్యాణం కోసం..

yadadri brahmostavam: ఆలయంలో నయన మనోహరంగా స్వామివారు జగన్మోహిని అలంకార సేవలో ఊరేగుతూ భక్తులను పరవశింపజేశారు. లోక కల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. వేద మంత్రాలు, వేదపారాయణాలు, మంగళ వాద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి వారు ఊరేగింపు సేవపై ఊరేగారు.

శుక్రవారం ముఖ్యమంత్రి రాక..

యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్షేత్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శిస్తున్నారు. యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి కేసీఆర్.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

12న రథోత్సవం

11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14 న ముగుస్తాయి. శుక్రవారం తిరుకల్యాణం, 12 న రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి:CM KCR to Visit Yadadri Temple : రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

Yadadri Brahmotsavalu 2022: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం.. జగన్మోహిని అలంకారంలో బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ నరసింహుడు భక్తులను కనువిందు చేశారు.

లోక కల్యాణం కోసం..

yadadri brahmostavam: ఆలయంలో నయన మనోహరంగా స్వామివారు జగన్మోహిని అలంకార సేవలో ఊరేగుతూ భక్తులను పరవశింపజేశారు. లోక కల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. వేద మంత్రాలు, వేదపారాయణాలు, మంగళ వాద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి వారు ఊరేగింపు సేవపై ఊరేగారు.

శుక్రవారం ముఖ్యమంత్రి రాక..

యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్షేత్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శిస్తున్నారు. యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి కేసీఆర్.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

12న రథోత్సవం

11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 14 న ముగుస్తాయి. శుక్రవారం తిరుకల్యాణం, 12 న రథోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు. బాలాలయ ప్రాంగణం, పరిసరాలలో రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా విద్యత్ దీపాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొండకింద పట్టణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. వెలుగులు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి:CM KCR to Visit Yadadri Temple : రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.