Kunda Satyanarayana died: మైథలాజికల్ టెంపుల్ సిటీ సురేంద్రపురి ఫౌండర్ కుందా సత్యనారాయణ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
ఆయన ఖమ్మం జిల్లా బసవాపురంలో 1938 జూన్ 15న జన్మించారు. నలుగురు సంతానంకాగా చిన్న కుమారుడు సురేంద్రబాబు చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు సమీపంలో... మైథలాజికల్ పార్క్ సురేంద్రపురిని నిర్మించారు. కుందా సత్యనారాయణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరపనున్నారు.