ETV Bharat / state

వృద్ధురాలి కథ.. కదిలిస్తే వ్యథ! - వృద్ధురాలి కథలు

అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో కర్ర సాయంతో పెన్షన్​ ఆఫీసుకు వచ్చిందో అవ్వ. ఏమీ తినకుండా వచ్చి మధ్యాహ్నం దాకా వేచి ఉంది. చేతికి డబ్బులందిన వెంటనే.. వణుకుతూ కి. మీ. దూరంలో ఉన్న ఇంటికి బయలుదేరింది. నడవలేని స్థితిలో రోడ్డు పక్కన సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన 'ఈటీవీ భారత్​'.. ఆటోలో ఆమెను నివాసానికి తరలించింది. అక్కడే ఆమె కన్నీటి వ్యధ వెలుగులోకి వచ్చింది.

pain full story of a old women
pain full story of a old women
author img

By

Published : May 21, 2021, 11:49 AM IST

యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలోని ప్రశాంత్​నగ​కు చెందిన ఈ అవ్వ పేరు జీడిమట్ల సావిత్రమ్మ (80). ఆమె భర్త, పెద్ద కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోయారు. చిన్న కుమారుడు రవీందర్ రెడ్డి అయిదేళ్ల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. కోడళ్లు, వారి పిల్లలు.. ఆ ఇంటికి దూరంగా మరోచోట ఉంటున్నారు. దీంతో.. పండు వయసులో దిక్కులేని ఆ కొడుకుకి ఆ ముసలి తల్లే అన్నీ తానై చంటిబిడ్డలా చూసుకుంటూ సేవలు చేస్తోంది.

కదిలిస్తే వ్యధ..

అవ్వకు వచ్చే పెన్షన్​ డబ్బే ఆ ఇంటికి ఆధారమైంది. వాటినే.. మందులు, మిగతా ఖర్చులకు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. రేషన్ కార్డు కూడా లేని వీరిని పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. కరోనా లాంటి సంక్షోభంలో.. తనకేదైనా అయితే తన కొడుకు పరిస్థితి ఏమవుతుందో అంటూ అవ్వ.. 'ఈటీవీ భారత్​' ప్రతినిధి ముందు కన్నీటి పర్యంతమైంది. తన కుమారుడికి పెన్షన్​, రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్నివేడుకుంటోంది. దాతలెవరైనా ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న తల్లీకొడుకులకు సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వెల్లువలా నకిలీ శానిటైజర్లు.. ఆల్కహాల్​కు బదులు రసాయనాలు

యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలోని ప్రశాంత్​నగ​కు చెందిన ఈ అవ్వ పేరు జీడిమట్ల సావిత్రమ్మ (80). ఆమె భర్త, పెద్ద కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోయారు. చిన్న కుమారుడు రవీందర్ రెడ్డి అయిదేళ్ల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. కోడళ్లు, వారి పిల్లలు.. ఆ ఇంటికి దూరంగా మరోచోట ఉంటున్నారు. దీంతో.. పండు వయసులో దిక్కులేని ఆ కొడుకుకి ఆ ముసలి తల్లే అన్నీ తానై చంటిబిడ్డలా చూసుకుంటూ సేవలు చేస్తోంది.

కదిలిస్తే వ్యధ..

అవ్వకు వచ్చే పెన్షన్​ డబ్బే ఆ ఇంటికి ఆధారమైంది. వాటినే.. మందులు, మిగతా ఖర్చులకు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. రేషన్ కార్డు కూడా లేని వీరిని పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. కరోనా లాంటి సంక్షోభంలో.. తనకేదైనా అయితే తన కొడుకు పరిస్థితి ఏమవుతుందో అంటూ అవ్వ.. 'ఈటీవీ భారత్​' ప్రతినిధి ముందు కన్నీటి పర్యంతమైంది. తన కుమారుడికి పెన్షన్​, రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్నివేడుకుంటోంది. దాతలెవరైనా ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న తల్లీకొడుకులకు సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వెల్లువలా నకిలీ శానిటైజర్లు.. ఆల్కహాల్​కు బదులు రసాయనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.