యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన బిరుకురి ప్రదీప్ ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. బీటెక్ చదివిన ఈ యువకుడు ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోని టాంజానియా వెళ్లారు. సంక్రాంతికి స్వగ్రామానికి బయలుదేరే ముందు ఈ నెల 4న నైజీరియా నుంచి 66కి.మి. దూరంలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరారు. 9న ఉదయానికల్లా విజయవంతంగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. సగర్వంగా భారత జాతీయ పతాకాన్ని చేతబూనారు.
ఇందుకు గాను అక్కడి 'మంకీ అడ్వెంచర్ ట్రావెల్ ఏజెన్సీ' సహకారం తీసుకున్నారు. ప్రదీప్ తల్లి సులోచన దినసరి కూలీ. తండ్రి శ్రీశైలం పక్షవాతంతో మంచం పట్టారు. ప్రదీప్ సాహసాన్ని స్థానికులు అభినందించారు.
ఇదీ చూడండి: తొలిరోజు 139 కేంద్రాల్లో టీకా.. యుద్ధప్రాతిపదికన సన్నాహాలు