ETV Bharat / state

'పాటిమట్ల పాలపిట్ట'కు బాలసాహిత్య ప్రతిభా పురస్కారం - పాటిమట్ల పాలపిట్ట కవిత్వం తాజా వార్త

పాఠశాల స్థాయి నుంచే కవిత్వం రాయడం అనేది అభినందించదగిన విషయమని సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పాటిమట్ల విద్యార్థులు రూపొందించిన 'పాటిమట్ల పాలపిట్ట' కవితా సంకలనం బాలసాహిత్య ప్రతిభా పురస్కారానికి ఎంపికైన సందర్భంగా వారికి ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు.

Patimatla Palapitta Poetry from Yadadri District has been nominated for the Children's Literature Award
'పాటిమట్ల పాలపిట్ట'కు బాలసాహిత్య ప్రతిభా పురస్కారం
author img

By

Published : Oct 26, 2020, 7:37 PM IST

మనం రాసే కవిత్వానికి చేసే ఆచరణకు సంబంధం ఉండాలని అప్పుడే ఆ కవిత్వం రాణిస్తుందని ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం పాటిమట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులచే రూపొందించబడిన కవితా సంకలనం 'పాటిమట్ల పాలపిట్ట'కు బాలసాహిత్య ప్రతిభా పురస్కారాన్ని ఆయన అందజేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన "చింతోజు బ్రహ్మయ్య- బాలమణి చారిటబుల్ ట్రస్ట్" వారు ఎంపిక చేసే బాలసాహిత్య ప్రతిభా పురస్కారానికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.

పాఠశాల స్థాయిలోనే కవిత్వ సృజన చేయడం అభినందించదగిన విషయం అని అందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అగ్గి రాములు, కవి, ఉపాధ్యాయుడు అరవింద రాయుడు, ప్రజా భారతి అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, మర్రి జయశ్రీ, కవి మోత్కూరు శ్రీనివాస్ ,సీనియర్ పాత్రికేయులు ఎస్​ఎన్​ చారి, యువ కవి బూరుగు గోపి కృష్ణ, గాదె వెంకటేశ్వర్లు, పసునూరి కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎర్రబెల్లి ముత్తయ్య, ఆండ్ర నరసింహ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మనం రాసే కవిత్వానికి చేసే ఆచరణకు సంబంధం ఉండాలని అప్పుడే ఆ కవిత్వం రాణిస్తుందని ప్రముఖ సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం పాటిమట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులచే రూపొందించబడిన కవితా సంకలనం 'పాటిమట్ల పాలపిట్ట'కు బాలసాహిత్య ప్రతిభా పురస్కారాన్ని ఆయన అందజేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన "చింతోజు బ్రహ్మయ్య- బాలమణి చారిటబుల్ ట్రస్ట్" వారు ఎంపిక చేసే బాలసాహిత్య ప్రతిభా పురస్కారానికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.

పాఠశాల స్థాయిలోనే కవిత్వ సృజన చేయడం అభినందించదగిన విషయం అని అందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అగ్గి రాములు, కవి, ఉపాధ్యాయుడు అరవింద రాయుడు, ప్రజా భారతి అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, మర్రి జయశ్రీ, కవి మోత్కూరు శ్రీనివాస్ ,సీనియర్ పాత్రికేయులు ఎస్​ఎన్​ చారి, యువ కవి బూరుగు గోపి కృష్ణ, గాదె వెంకటేశ్వర్లు, పసునూరి కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎర్రబెల్లి ముత్తయ్య, ఆండ్ర నరసింహ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఎందరికో ఆదర్శం ఈ మహిళ... చెత్త సేకరణే తనకు పండుగ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.