ETV Bharat / state

డీఎస్సీ అభ్యర్ధులకు వారంలో పోస్టింగులు - న్యాయపోరాటానికి ఫలితం దక్కింది - 2008 DSC SGT TEACHER

1,382 మందిని కాంట్రాక్టు ఎస్​జీటీలుగా నియమించనున్న విద్యాశాఖ - కొత్త జిల్లాల వారీగా పోస్టింగులు - దాదాపు పదిహేనేళ్ల ఎదురుచూపులకు తెరదించిన విద్యాశాఖ

SGT POSTINGS
2008 DSC CANDIDATES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 3:29 PM IST

2008 DSC Teacher Postings : డీఎస్సీ-2008లో నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడీ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్​ ఉద్యోగాలు ఇవ్వనుంది. వారిని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ)లుగా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి, మెరిట్‌ జాబితాలో ఉన్నా బీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమయ్యారు.

ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం : తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటీ టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం 2024 సెప్టెంబరు 24న కాంగ్రెస్​ సర్కారు నిర్ణయం తీసుకుంది.

కాంట్రాక్టు ప్రాతిపదికన 1382 మంది : 2008 డీఎస్సీ నోటిఫికేషన్​లో నష్టపోయిన అభ్యర్థులు మొత్తం 2,367 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు సేకరించింది. వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని, కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ)గా పని చేస్తామంటూ అభ్యర్థులు ఒప్పుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ కోరగా వెంటనే 1,382 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి అంగీకరించారు.

వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు విధివిధానాల రూపకల్పన చేసే ఫైల్​కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెల రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడంపై జాప్యం జరుగుతుండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో ప్రభుత్వం త్వరితగతిన ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో 2008-డీఎస్సీ బాధిత అభ్యర్థులు ఉన్నారని చెబుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం : ఉద్యోగాల భర్తీని చేపట్టమని గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పాటించరా అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహా రెడ్డిని ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ కమిషనర్ మరో మూడు రోజుల్లో నియమకాలు చేపట్టడానికి ఎన్నికల సంఘం అనుమతిని తీసుకున్నట్లు తెలిపారు.

వచ్చేనెలలోనే నోటిఫికేషన్ - డీఎస్సీకి సిద్ధం కండి!

2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - మూడు రోజుల్లో నియమాక ప్రక్రియ పూర్తి!

2008 DSC Teacher Postings : డీఎస్సీ-2008లో నష్టపోయిన వారిలో 1,382 మంది బీఈడీ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్​ ఉద్యోగాలు ఇవ్వనుంది. వారిని సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ)లుగా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో మంచి మార్కులు సాధించి, మెరిట్‌ జాబితాలో ఉన్నా బీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు దూరమయ్యారు.

ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం : తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని నాటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటీ టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తూ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం 2024 సెప్టెంబరు 24న కాంగ్రెస్​ సర్కారు నిర్ణయం తీసుకుంది.

కాంట్రాక్టు ప్రాతిపదికన 1382 మంది : 2008 డీఎస్సీ నోటిఫికేషన్​లో నష్టపోయిన అభ్యర్థులు మొత్తం 2,367 మంది ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు సేకరించింది. వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని, కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ)గా పని చేస్తామంటూ అభ్యర్థులు ఒప్పుకోవాల్సి ఉంటుందని విద్యాశాఖ కోరగా వెంటనే 1,382 మంది కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి అంగీకరించారు.

వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు విధివిధానాల రూపకల్పన చేసే ఫైల్​కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెల రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడంపై జాప్యం జరుగుతుండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో ప్రభుత్వం త్వరితగతిన ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో 2008-డీఎస్సీ బాధిత అభ్యర్థులు ఉన్నారని చెబుతున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం : ఉద్యోగాల భర్తీని చేపట్టమని గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పాటించరా అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహా రెడ్డిని ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ కమిషనర్ మరో మూడు రోజుల్లో నియమకాలు చేపట్టడానికి ఎన్నికల సంఘం అనుమతిని తీసుకున్నట్లు తెలిపారు.

వచ్చేనెలలోనే నోటిఫికేషన్ - డీఎస్సీకి సిద్ధం కండి!

2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - మూడు రోజుల్లో నియమాక ప్రక్రియ పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.