ETV Bharat / state

యాదాద్రి భువనగిరి జిల్లాను తాకని కరోనా - యాదాద్రి భువనగిరి జిల్లాను తాకని కరోనా

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్​లో 28 మంది ఉన్నారు. ఇందులో 24 మందికి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉన్నాయి.

no single corona positive case is filed in Yadadri Bhuvanagiri district
యాదాద్రి భువనగిరి జిల్లాను తాకని కరోనా
author img

By

Published : Apr 20, 2020, 12:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల కరోనా అక్కడ అడుగుపెట్టలేకపోయింది. బీబీనగర్​ ఎయిమ్స్​ క్వారంటైన్​లో ఉన్న 28 మందికి జరిపిన కొవిడ్-19 నిర్ధరణ పరీక్షల్లో 24 మందికి నెగిటివ్ అని తేలింది. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉదని జిల్లా వైద్యారోగ్య అధికారి సాంబశివరావు తెలిపారు.

ఆలేరు బస్టాండ్​లో మతిస్థిమితం సరిగ్గాలేని ఓ తమిళ మహిళకు కరోనా సోకిందనే అనుమానంతో ఆమె శాంపిల్స్ సేకరించి హైదరాబాద్​కు పంపించారు దాని ఫలితం నెగిటివ్​గా వచ్చిందని సాంబశివరావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితమే వచ్చిందని చెప్పారు.

జిల్లాలో ప్రస్తుతం 391 మంది హోమ్ క్వారంటైన్​లో ఉన్నారని జిల్లా వైద్యారోగ్య అధికారి తెలిపారు. ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ఉదయం వేళలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ వాహనాలతో గల్లీల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల కరోనా అక్కడ అడుగుపెట్టలేకపోయింది. బీబీనగర్​ ఎయిమ్స్​ క్వారంటైన్​లో ఉన్న 28 మందికి జరిపిన కొవిడ్-19 నిర్ధరణ పరీక్షల్లో 24 మందికి నెగిటివ్ అని తేలింది. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉదని జిల్లా వైద్యారోగ్య అధికారి సాంబశివరావు తెలిపారు.

ఆలేరు బస్టాండ్​లో మతిస్థిమితం సరిగ్గాలేని ఓ తమిళ మహిళకు కరోనా సోకిందనే అనుమానంతో ఆమె శాంపిల్స్ సేకరించి హైదరాబాద్​కు పంపించారు దాని ఫలితం నెగిటివ్​గా వచ్చిందని సాంబశివరావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితమే వచ్చిందని చెప్పారు.

జిల్లాలో ప్రస్తుతం 391 మంది హోమ్ క్వారంటైన్​లో ఉన్నారని జిల్లా వైద్యారోగ్య అధికారి తెలిపారు. ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. ఉదయం వేళలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం వరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ వాహనాలతో గల్లీల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.