యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో 8 మంది కరోనా బాధితుల కుటుంబాలకు ఎంపీటీసీ పలుగుల నవీన్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇంటింటి సర్వేలో ఉష్ణోగ్రత పరీక్షించడం కోసం థర్మల్ స్కానర్ను ఆరోగ్య సిబ్బందికి అందజేశారు. కొవిడ్ బాధితులను వ్యాధిగ్రస్తులుగా కాకుండా ఆత్మీయులుగా చూడాలని సూచించారు.
భౌతికదూరం పాటిస్తూ వారికి సాయం చేయాలన్నారు. మందులు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేంద్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రూ. 860 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత!