ETV Bharat / state

నారసింహుని పుణ్యక్షేత్రం అద్భుతం: మాధవానంద స్వామి

యాదాద్రి నారసింహుని క్షేత్రాన్ని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద స్వామి సందర్శించారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

author img

By

Published : May 3, 2021, 4:56 PM IST

Madhavananda Swamy visited sri lakshmi narasimha swamy, yadadri temple works
శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మాధవానంద స్వామి, యాదాద్రి ఆలయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద స్వామి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని పనులను పరిశీలించారు. గర్భాలయం ఫ్లోరింగ్​, స్పటిక లింగ ప్రతిష్ఠ విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని ఆయన అన్నారు. వేగంగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పనులు 99 శాతం శాస్త్రోక్తంగా జరిగాయని తెలిపారు.

నూతన ప్రధాన ఆలయంలో పున:ప్రతిష్ఠ మహోత్సవం త్వరగా జరగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. స్వామితో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద స్వామి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని పనులను పరిశీలించారు. గర్భాలయం ఫ్లోరింగ్​, స్పటిక లింగ ప్రతిష్ఠ విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని ఆయన అన్నారు. వేగంగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పనులు 99 శాతం శాస్త్రోక్తంగా జరిగాయని తెలిపారు.

నూతన ప్రధాన ఆలయంలో పున:ప్రతిష్ఠ మహోత్సవం త్వరగా జరగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. స్వామితో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఏపీలో ఎల్లుండి నుంచి మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.