బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్ పిల్లలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు.
విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని, భవిష్యత్లో విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ: సుప్రీం