ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం ఎంతంటే..

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ లెక్కించారు. కొండపైన గల హరిత భవనం నందు ఆలయ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. 19 రోజుల్లో రూ.57లక్షల 18వేల 345 రూపాయల నగదు వచ్చినట్లు తెలిపారు.

author img

By

Published : Apr 6, 2021, 7:12 PM IST

yadadri hundi counting, yadadri lakshmi narsimha swamy
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, యాదాద్రి హుండీ

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 రోజుల్లో 57,18,345 రూపాయలు, 25 గ్రాముల బంగారం, 1,500 గ్రాముల వెండి.. ఖజానాకు వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి తెలిపారు. మాస్కులు, చేతులకు గ్లౌస్​లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ హుండీ లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రి దేవస్థానంలో ఇటీవల పూజారులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అందువల్ల 7 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఒకవైపు ఎండలు, మరోవైపు కరోనా ప్రభావం వల్ల భక్తుల రాక గణనీయంగా తగ్గింది. స్వామివారి ఆదాయం తగ్గిపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 19 రోజుల్లో 57,18,345 రూపాయలు, 25 గ్రాముల బంగారం, 1,500 గ్రాముల వెండి.. ఖజానాకు వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి తెలిపారు. మాస్కులు, చేతులకు గ్లౌస్​లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ హుండీ లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రి దేవస్థానంలో ఇటీవల పూజారులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అందువల్ల 7 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. ఒకవైపు ఎండలు, మరోవైపు కరోనా ప్రభావం వల్ల భక్తుల రాక గణనీయంగా తగ్గింది. స్వామివారి ఆదాయం తగ్గిపోయింది.

ఇదీ చూడండి: పదో విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.