ETV Bharat / state

యాదాద్రిలో ఘరానా మోసం... రూ.8.1కోట్లు టోకరా - Housing Fraud in Yadadri district

యాదాద్రిలో పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12లక్షల 22వేల నగదు, ల్యాప్​టాప్, పలు రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

యాదాద్రిలో ఘరానా మోసం... రూ.8.1కోట్లు టోకరా
author img

By

Published : May 25, 2019, 11:48 PM IST

యాదాద్రి జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న మాల్యావి కరుణోదయ సొసైటీ నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. మొదట రూ.30వేలు చెల్లిస్తే ఇల్లు నిర్మించి ఇస్తామని నిందితులు పేదవారిని నమ్మించారు. ఇలా 2వేల 700మంది బాధితుల నుంచి దాదాపు రూ.8.1 కోట్లు వసూలు చేసినట్లు యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. డబ్బు కట్టాక కూడా ఇల్లు నిర్మించకపోవటం వల్ల ఆలేరుకు చెందిన రమాదేవి అనే మహిళ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్​వోటీ పోలీసులు హైదరాబాద్​లోని వారి కార్యాలయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కొండ కృష్ణమ్మ, కొండ రమేష్, కొండ వెంకట నారాయణ, కట్ట మహేంద్రనాధ్​లను అరెస్టు చేయగా... కొత్త రాజిరెడ్డి, జజర్ల సాయి చరణ్​లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.12లక్షల 22వేల నగదు, ల్యాప్​టాప్, పలు రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టు ద్వారా తమ సొమ్ము పొందాలని సూచించారు.

యాదాద్రిలో ఘరానా మోసం... రూ.8.1కోట్లు టోకరా

ఇవీ చూడండి: గుజరాత్​ సర్కారుకు ఎన్​హెచ్​ఆర్​సీ​ నోటీసు

యాదాద్రి జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న మాల్యావి కరుణోదయ సొసైటీ నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. మొదట రూ.30వేలు చెల్లిస్తే ఇల్లు నిర్మించి ఇస్తామని నిందితులు పేదవారిని నమ్మించారు. ఇలా 2వేల 700మంది బాధితుల నుంచి దాదాపు రూ.8.1 కోట్లు వసూలు చేసినట్లు యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. డబ్బు కట్టాక కూడా ఇల్లు నిర్మించకపోవటం వల్ల ఆలేరుకు చెందిన రమాదేవి అనే మహిళ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్​వోటీ పోలీసులు హైదరాబాద్​లోని వారి కార్యాలయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కొండ కృష్ణమ్మ, కొండ రమేష్, కొండ వెంకట నారాయణ, కట్ట మహేంద్రనాధ్​లను అరెస్టు చేయగా... కొత్త రాజిరెడ్డి, జజర్ల సాయి చరణ్​లు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.12లక్షల 22వేల నగదు, ల్యాప్​టాప్, పలు రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టు ద్వారా తమ సొమ్ము పొందాలని సూచించారు.

యాదాద్రిలో ఘరానా మోసం... రూ.8.1కోట్లు టోకరా

ఇవీ చూడండి: గుజరాత్​ సర్కారుకు ఎన్​హెచ్​ఆర్​సీ​ నోటీసు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.