హైదరాబాద్ ఔషధ నగరి అని, నగరం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయ పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా భువనగిరికి చేరుకున్న గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో తన మిత్రుడు, జిల్లా భాజపా కార్యదర్శి నర్ల నర్సింగరావును కలిశారు. ఈ మధ్యనే వివాహమైన ఆయన కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు.
కొవిడ్ వల్ల తన రాజకీయ జీవితంలో గానీ, ప్రజా జీవితంలో గానీ ఎప్పుడూ ఇంత నిర్బంధాన్ని ఎదుర్కోలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో అందరూ ధైర్యంగా నిలబడాలని, కరోనా నియమాలను అందరూ పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ భారత్లో తయారవడం దేశానికి గర్వకారణమని అన్నారు. కొవిడ్ పైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండి మరింత లబ్ధిపొందాలని బండారు దత్తాత్రేయ సూచించారు.
ఇదీ చదవండి: వసతిగృహాల్లో ఉండాలంటే కరోనా పరీక్ష తప్పనిసరి