యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కూరెళ్ల గ్రామంలో తెరాస నేతలు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 10వేల కోడిగుడ్లు పంచారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, టీఎస్ క్యాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డీఎల్డీఏ ఛైర్మన్ మోతె పిచ్చిరెడ్డిల చేతుల మీదుగా పేదలకు సరుకులు అందించారు.
లాక్డౌన్ పరిస్థితుల్లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కరోనా నుంచి రక్షించుకోవాలంటే.. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మాస్క్తో మార్నింగ్ వాక్.. చాలా డేంజర్!