ETV Bharat / state

రేపటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు - Cancellation of Yadadri Argitha services due to corona virus

యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భయం తెలంగాణలో ఆలయాలను సైతం గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధికారులు ఆర్జిత సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఈనెల 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటించారు.

Cancellation of Yadadri Argitha services due to corona virus
రేపటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు
author img

By

Published : Mar 19, 2020, 10:22 PM IST

కరోనా ఎఫెక్ట్ యాదాద్రి ఆలయాన్ని చేరుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. లఘు దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు ఆమె వెల్లడించారు.

నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశ ఖండనాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ నివారణకు.. ఆలయంలో అర్చకులు శ్రీ సుదర్శన నారసింహ మహ ధన్వంతరి జప హోమాన్ని నిర్వహిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు.

రేపటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు

ఇదీ చదవండిః 'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష

కరోనా ఎఫెక్ట్ యాదాద్రి ఆలయాన్ని చేరుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి మార్చి 31 వరకు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. లఘు దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు ఆమె వెల్లడించారు.

నిత్య, శాశ్వత కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, కేశ ఖండనాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ నివారణకు.. ఆలయంలో అర్చకులు శ్రీ సుదర్శన నారసింహ మహ ధన్వంతరి జప హోమాన్ని నిర్వహిస్తున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు.

రేపటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు

ఇదీ చదవండిః 'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.