ETV Bharat / state

'వరదసాయం పేరుతో... ప్రభుత్వం ప్రజలను వేధిస్తోంది'

author img

By

Published : Nov 18, 2020, 3:08 PM IST

హైదరాబాద్​లో వచ్చిన వరదల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు పరిహారం ఇప్పటికీ అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే డబ్బులు వస్తుండడం వల్ల మీ సేవ కేంద్రాల వద్ద వందలాది మంది క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. క్యూ లైన్‌లో నిలబెట్టి.. తెరాస ప్రభుత్వం ప్రజలను అవమానపరుస్తోందన్నారు.

క్యూ లైన్​లో నిలబెట్టి ప్రభుత్వం అవమానపరుస్తోంది: ఎంపీ కోమటిరెడ్డి
క్యూ లైన్​లో నిలబెట్టి ప్రభుత్వం అవమానపరుస్తోంది: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు వరద సహాయం ఇప్పటికీ అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ముంపు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

వరద బాధితులకు ఇంటి వద్దకే పరిహారం వస్తుందని.. మంత్రి కేటీఆర్ చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే డబ్బులు వస్తుండడం వల్ల మీ సేవ కేంద్రాల వద్ద వందలాది మంది క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిలబడినా.. దరఖాస్తులు తీసుకోవడం లేదని, వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు నిలబడలేక ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

క్యూ లైన్‌లో నిలబెట్టి.. తెరాస ప్రభుత్వం ప్రజలను అవమానపరుస్తోందని.. తక్షణమే కేసీఆర్, కేటీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు.. తెరాస ఇచ్చే రూ. 10 వేలు ఏ మూలకు సరిపోవని ధ్వజమెత్తారు. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని గ్రేటర్‌ ఎన్నికల్లో గెలవాలని తెరాస చూస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి'

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు వరద సహాయం ఇప్పటికీ అందలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ముంపు బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

వరద బాధితులకు ఇంటి వద్దకే పరిహారం వస్తుందని.. మంత్రి కేటీఆర్ చెప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే డబ్బులు వస్తుండడం వల్ల మీ సేవ కేంద్రాల వద్ద వందలాది మంది క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో నిలబడినా.. దరఖాస్తులు తీసుకోవడం లేదని, వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు నిలబడలేక ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

క్యూ లైన్‌లో నిలబెట్టి.. తెరాస ప్రభుత్వం ప్రజలను అవమానపరుస్తోందని.. తక్షణమే కేసీఆర్, కేటీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు.. తెరాస ఇచ్చే రూ. 10 వేలు ఏ మూలకు సరిపోవని ధ్వజమెత్తారు. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని గ్రేటర్‌ ఎన్నికల్లో గెలవాలని తెరాస చూస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.