ETV Bharat / state

రోగనిరోధక శక్తిని పెంచే కరోనా టీ

author img

By

Published : Aug 1, 2020, 8:53 PM IST

కరోనా బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచే ప్రకృతి సిద్ధమైన కాడ కషాయాన్ని ప్రతి ఒక్కరూ తాగాలని వలిగొండ ఎంపీపీ నూతిరమేశ్​రాజు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన కరోనా టీ స్టాల్​ను ఆయన ప్రారంభిచారు.​

a corona tea center established at Valigonda in Yadadri Bhuvanagiri district
రోగనిరోధక శక్తిని పెంచే కరోనా టీ

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి వలిగొండలో కరోనా వ్యాప్తి నివారణకై రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రజలకు ఉచిత కాడ కాషాయం టీ స్టాల్​ను ఏర్పాటు చేశారు. దీనిని ఎంపీపీ నూతిరమేశ్​ రాజు, సర్పంచ్ బోళ్ల లలితాశ్రీనివాస్ ముదిరాజ్, గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు.

వైరస్ నివారణకై ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ, సామాజిక దూరాన్ని పాటించాలని.. మాస్కు తప్పనిసరిగా ధరించాలని నూతి రమేశ్​ అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. విపత్కర సమయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన అభినందించారు.

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి వలిగొండలో కరోనా వ్యాప్తి నివారణకై రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రజలకు ఉచిత కాడ కాషాయం టీ స్టాల్​ను ఏర్పాటు చేశారు. దీనిని ఎంపీపీ నూతిరమేశ్​ రాజు, సర్పంచ్ బోళ్ల లలితాశ్రీనివాస్ ముదిరాజ్, గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు.

వైరస్ నివారణకై ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ, సామాజిక దూరాన్ని పాటించాలని.. మాస్కు తప్పనిసరిగా ధరించాలని నూతి రమేశ్​ అన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. విపత్కర సమయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి: 'ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుందని నమ్ముతున్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.