మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పిలుపు మేరకు మంత్రి ఎర్రబెల్లి ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.
హన్మకొండ రాంనగర్లోని ఎర్రబెల్లి నివాసం ముందు కార్మికులు నిరసన తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరస్పరం తోపులాట జరిగింది. కార్మికులను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు.
పలువురు మహిళా ఉద్యోగులను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. కాంగ్రెస్, వామపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు... ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : అయోధ్య తీర్పు ఉంటే.. చలో ట్యాంక్బండ్ ఎలా చేస్తారు?