ETV Bharat / state

రుద్రాక్ష వృక్షం.. వరంగల్ వాసి అద్భుతం..

అది ఒక చెట్టు నుంచి వచ్చే విత్తనం. హిందువులు దానిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూజకు ఉపయోగిస్తారు. శక్తిమంతమైనదిగా భావించి శరీరంపై ధరిస్తారు. ఈ గింజల్లో ఏకముఖం, ద్విముఖం, త్రిముఖం నుంచి 21 ముఖాలతో ఈ విత్తనం ఆకట్టుకుంటుంది.

author img

By

Published : Mar 23, 2019, 10:03 AM IST

Updated : Mar 23, 2019, 4:04 PM IST

రుద్రాక్ష వృక్షం.. వరంగల్ వాసి అద్భుతం..
రుద్రాక్ష వృక్షం.. వరంగల్ వాసి అద్భుతం..
హిందువులకు అదో పవిత్రమైన చెట్టు... హిమాలయాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే ఎక్కువగా కనబడుతుంది. అలాంటి అరుదైన వృక్షం వరంగల్ జిల్లా కాజీపేటలో అందరికి కనువిందు చేస్తోంది. అదేంటో కాదు... రుద్రాక్ష వృక్షం. మైదాన ప్రాంతంలో ఇంత ఏపుగా పెరగడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కాజీపేట సిద్దార్థనగర్​కి చెందిన శౌరిరెడ్డి, సునీతా దంపతులు తూర్పుగోదావరి నుంచి ఏడు సంవత్సరాల క్రితం రుద్రాక్ష మొక్కను తీసుకువచ్చారు. తమ పండ్లతోటలో నాటారు. అప్పటి నుంచి మొక్క పెంపకంపై ప్రత్యేకశ్రద్ధను కనబరుస్తూ... పూర్తిగా సేంద్రీయ ఎరువులను అందించారు.

ఈ సంవత్సరం చెట్టు నుంచి మొదటిసారిగా పూతకి వచ్చి కాయలు కాయడం ప్రారంభించింది. చెట్టు నుంచి వచ్చిన కాయలను ఎండబెట్టి గింజలను తీయగా సుమారు వెయ్యి వరకు రుద్రాక్షలు వచ్చాయని తెలిపారు. ద్విముఖం, త్రిముఖం నుంచి 21 ముఖాల వరకు కలిగిన రుద్రాక్షలు లభిస్తున్నాయని చెబుతున్నారు.

ఇదీ చూడండి: 21 ముఖాలతో కనువిందు చేస్తున్నరుద్రాక్షలు

రుద్రాక్ష వృక్షం.. వరంగల్ వాసి అద్భుతం..
హిందువులకు అదో పవిత్రమైన చెట్టు... హిమాలయాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే ఎక్కువగా కనబడుతుంది. అలాంటి అరుదైన వృక్షం వరంగల్ జిల్లా కాజీపేటలో అందరికి కనువిందు చేస్తోంది. అదేంటో కాదు... రుద్రాక్ష వృక్షం. మైదాన ప్రాంతంలో ఇంత ఏపుగా పెరగడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కాజీపేట సిద్దార్థనగర్​కి చెందిన శౌరిరెడ్డి, సునీతా దంపతులు తూర్పుగోదావరి నుంచి ఏడు సంవత్సరాల క్రితం రుద్రాక్ష మొక్కను తీసుకువచ్చారు. తమ పండ్లతోటలో నాటారు. అప్పటి నుంచి మొక్క పెంపకంపై ప్రత్యేకశ్రద్ధను కనబరుస్తూ... పూర్తిగా సేంద్రీయ ఎరువులను అందించారు.

ఈ సంవత్సరం చెట్టు నుంచి మొదటిసారిగా పూతకి వచ్చి కాయలు కాయడం ప్రారంభించింది. చెట్టు నుంచి వచ్చిన కాయలను ఎండబెట్టి గింజలను తీయగా సుమారు వెయ్యి వరకు రుద్రాక్షలు వచ్చాయని తెలిపారు. ద్విముఖం, త్రిముఖం నుంచి 21 ముఖాల వరకు కలిగిన రుద్రాక్షలు లభిస్తున్నాయని చెబుతున్నారు.

ఇదీ చూడండి: 21 ముఖాలతో కనువిందు చేస్తున్నరుద్రాక్షలు

Last Updated : Mar 23, 2019, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.