ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు లేవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ఆయన దవాఖానాలో కొవిడ్ వార్డును పరిశీలించారు. కొవిడ్ బాధితులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు.
ఆస్పత్రిలోని కొవిడ్ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆరోపించారు. వైద్య సిబ్బంది కొరత ఉందని... ఉన్న వారిపైనే అధిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో మాస్కులు, ఆక్సిజన్ కొరత ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తన దృష్టికి తీసుకొచ్చినట్లు బండి సంజయ్ అన్నారు.
ఇదీ చూడండి: ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లు అడ్డుకోవద్దు: జగ్గారెడ్డి