రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఎర్రబెల్లి దయాకర్రావులు కలిసి వరంగల్లో ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు.
అనంతరం ఆస్పత్రిలో కలియ తిరుగుతూ వైద్య పరికరాలు పరిశీలించారు. ముగ్గురు మంత్రులు రక్తపోటు చెకప్ చేయించుకున్నారు. ముగ్గురు మంత్రులు ఒకే చోటు చేరగా.. సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, మాజీ మంత్రి కడియం, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డిలు పాల్గొన్నారు.