ETV Bharat / state

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా' - దాస్యం వినయ్​భాస్కర్

రాజకీయంగా తన ఎదుగుదల సహించలేని కొందరు పనిగట్టుకుని తనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​భాస్కర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'
author img

By

Published : Sep 13, 2019, 6:19 PM IST

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

దాస్యం కుటుంబ సభ్యులెవరూ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వ చీఫ్​ విప్​ అన్నారు. తన ఎదుగుదల సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన చెందారు. తాను తప్పు చేశానని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే హన్మకొండ ప్రెస్​క్లబ్​లో ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్​ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక ముందు తనకెవరూ పుష్పగుచ్చాలు తీసుకురావద్దని, శాలువాలు కప్పొద్దని....ఆ డబ్బులతో పుస్తకాలు తీసుకువస్తే...పేద విద్యార్ధులకు అందించవచ్చని తెలిపారు.

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

దాస్యం కుటుంబ సభ్యులెవరూ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వ చీఫ్​ విప్​ అన్నారు. తన ఎదుగుదల సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన చెందారు. తాను తప్పు చేశానని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే హన్మకొండ ప్రెస్​క్లబ్​లో ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్​ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక ముందు తనకెవరూ పుష్పగుచ్చాలు తీసుకురావద్దని, శాలువాలు కప్పొద్దని....ఆ డబ్బులతో పుస్తకాలు తీసుకువస్తే...పేద విద్యార్ధులకు అందించవచ్చని తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.