వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో వాకర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్ గార్డెన్లో పాదచారులు చీపుర్లు పట్టుకుని పార్కులో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చారు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలను ఏరిపారేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'