ETV Bharat / state

హన్మకొండలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

author img

By

Published : Feb 27, 2020, 10:55 PM IST

ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది.

Road accident in hanmakonda
హన్మకొండలో రోడ్డు ప్రమాదం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి కుమార్ స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు.

కుమార్ స్వామి.. హన్మకొండ నుంచి కాజీపేటకు వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి: మానవ హక్కుల కమిషన్​లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి కుమార్ స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు.

కుమార్ స్వామి.. హన్మకొండ నుంచి కాజీపేటకు వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి: మానవ హక్కుల కమిషన్​లో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.