ETV Bharat / state

తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: ఉత్తమ్​కుమార్​రెడ్డి - Warangal-Khammam-Nalgonda graduate MLC candidate Ramulu Nayak

వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని ఉత్తమ్​కుమార్​ పిలుపునిచ్చారు.

తెరాసకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​కుమార్​రెడ్డి
తెరాసకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​కుమార్​రెడ్డి
author img

By

Published : Feb 24, 2021, 5:34 PM IST

నిరుద్యోగులను మోసం చేసిన తెరాస ప్రభుత్వానికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి వరంగల్​లో పేర్కొన్నారు. హన్మకొండలోని ​పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్​కుమార్ ​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి హాజరయ్యారు.

కాంగ్రెస్​ పార్టీ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ను గెలిపించే బాధ్యత కాంగ్రెస్​ కార్యకర్తలపై ఉందని ఉత్తమ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తీర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేదని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యోగస్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను తెరాస ప్రభుత్వం మట్టుబెడుతుందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు.

నిరుద్యోగులను మోసం చేసిన తెరాస ప్రభుత్వానికి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి వరంగల్​లో పేర్కొన్నారు. హన్మకొండలోని ​పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్​కుమార్ ​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి హాజరయ్యారు.

కాంగ్రెస్​ పార్టీ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ను గెలిపించే బాధ్యత కాంగ్రెస్​ కార్యకర్తలపై ఉందని ఉత్తమ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తీర్చాలనే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేదని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యోగస్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్​ పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను తెరాస ప్రభుత్వం మట్టుబెడుతుందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు.

ఇదీ చూడండి: గెలుపు బాధ్యత తెరాస ఎమ్మెల్యేలదే: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.