ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వరంగల్ బల్దియా అధికారులతో పాటు విలీన గ్రామాల్లో పర్యటించడం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం వరంగల్ మహానగర పాలక సంస్థ 5వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం, ముస్కులపల్లి, బొల్లికుంట గ్రామాల్లో మేయర్ గుండా ప్రకాష్ రావుతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. రూ.2.50కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
![parakala mla, warangal baldia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10321715_939_10321715_1611210998112.png)