యూపీ హాథ్రస్ యువతి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ధర్నా చేపట్టారు. రోజురోజుకు ఎస్సీలపై దాడులు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.
దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోతోందని మందకృష్ణ మాదిగ ఆవేదన చెందారు. అగ్రకులాల మహిళలకు అన్యాయం జరిగితే స్పందించే ప్రభుత్వాలు.. అణగారిన వర్గాల యువతులకు జరిగితే ఏ మాత్రం స్పందించడం లేదన్నారు.
ఇదీ చదవండి: 'భూములు ఇస్తానని చెప్పి ఉన్న భూమిని లాక్కుంటే ఎలా'