ETV Bharat / state

'పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస గెలిచేలా కృషి చేయాలి'

author img

By

Published : Sep 22, 2020, 9:15 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఉద్యమ పార్టీ అయినా తెరాసను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

mla aruri ramesh meeting at vardhannapet for campaigning to graduate mlc
'పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస గెలిచేలా కృషి చేయాలి'

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇన్​ఛార్జిలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.

పట్టభద్రులైన యువతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే వెల్లడించారు. మండలపరిధిలో గ్రామాల వారిగా పట్టభద్రుల జాబితా రూపొందించుకుని వారందరితో ఓటు నమోదు చేయించాలని సూచించారు. నల్గొండ, వరంగల్​, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్​లో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇన్​ఛార్జిలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.

పట్టభద్రులైన యువతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే వెల్లడించారు. మండలపరిధిలో గ్రామాల వారిగా పట్టభద్రుల జాబితా రూపొందించుకుని వారందరితో ఓటు నమోదు చేయించాలని సూచించారు. నల్గొండ, వరంగల్​, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండిః అమీన్‌పూర్‌ మారుతి హోం బాలిక మృతి కేసులో నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.