కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కొనియాడారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారన్నారు.
గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ తిమ్మాపూర్లో పారిశుద్ధ్య కార్మికులకు నోట్ల దండలతో వినూత్నంగా సన్మానం చేశారు. అనంతరం బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్, కార్పొరేటర్ చింతల యాదగిరి, పీఏసీఎస్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.