వరంగల్ పట్టణ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్లో ముస్లింలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సరకులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా సుమారు 200 మందికి నిత్యావసర సరకులను అందజేశారు.
నిరుపేద ముస్లింలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అరూరి గట్టుమల్లు ట్రస్ట్ ఆధ్వర్యంలో సరకులను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే రమేష్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ముస్లింలు భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: గోదావరి జలాలపై సీఎం దృష్టి.. 17న ప్రత్యేక భేటీ