జనగామ జిల్లా కేంద్రమైన జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న తెరాస పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, తగు సూచనలు చేశారు.
హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న మంత్రి పార్టీ కార్యాలయం వద్ద ఆగి... జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి ఉన్నారు.
![తెరాస కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎర్రబెల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-62-19-mantri-errabelli-parishilana-av-ts10070_19062020143555_1906f_1592557555_877.jpg)