ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏఐటీయూసీ కార్మిక సంఘం తమ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్మిక సంఘం నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఇవీ చూడండి: సమ్మె విరమించి చర్చలకు రండి: తెరాస పార్లమెంటరీ నేత కేకే