పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్లో సీటు ఎలా సాధించాలో మెలకువలు నేర్పించారు కోట రాజస్థాన్ రెజోనెన్స్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ నాయర్, వరంగల్ నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో ఈనాడు- కోట రాజస్థాన్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి తర్వాత ఏం చేయాలో అని ఆందోళనలో ఉన్న తమకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'మాటమీద ఎవరుంటారో ప్రజలకు తెలుసు'