ఉమ్మడి వరంగల్ జిల్లా ఘన్పూర్ మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన రేణుక-కృష్ణ దంపతులకు ముగ్గురు సంతానం. చివరివాడైన 12 ఏళ్ల చరణ్ను 2016 జులైలో జనగామలోని ఎస్సి గురుకుల పాఠశాలలో చేర్చారు. ఆగస్టు 8న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి పోరాడుతున్నారు.
దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు జరిపించాలని కోరుతూ తల్లిదండ్రులు.. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కోరారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ... ఘటనపై పూర్తి దర్యాప్తు జరపాలని ఆదేశించింది.
ఇదీ చూడండి : శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం... భారీ ఆస్తి నష్టం