ETV Bharat / state

కడిపికొండలో 'గోదావరి' మృత్యు 'ఘోష' - కడిపికొండలో 'గోదావరి' మత్యు 'ఘోష'

గోదావరిలో ప్రమాదానికి గురైన వరంగల్​ అర్బన్​ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన అవినాశ్​, రాజేందర్​ల మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి.

కడిపికొండలో 'గోదావరి' మత్యు 'ఘోష'
author img

By

Published : Sep 17, 2019, 9:58 AM IST

Updated : Sep 17, 2019, 10:02 PM IST

ఈనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పడవ ప్రమాదంలో వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​ మండలం కడిపికొండకు బస్కే అవినాశ్​, బస్కె రాజేందర్​లు మృతి చెందారు. వారి మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి స్వగ్రామానికి తరలించారు. విహార యాత్రకు వెళ్లి విగత జీవులుగా వచ్చి తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే గ్రామం నుంచి విహార యాత్రకు వెళ్లిన... 14 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఏడుగురి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.

కడిపికొండలో 'గోదావరి' మృత్యు 'ఘోష'

ఈనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పడవ ప్రమాదంలో వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్​ మండలం కడిపికొండకు బస్కే అవినాశ్​, బస్కె రాజేందర్​లు మృతి చెందారు. వారి మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి స్వగ్రామానికి తరలించారు. విహార యాత్రకు వెళ్లి విగత జీవులుగా వచ్చి తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే గ్రామం నుంచి విహార యాత్రకు వెళ్లిన... 14 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఏడుగురి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.

కడిపికొండలో 'గోదావరి' మృత్యు 'ఘోష'
TG_WGL_11_17_SWAGRAAMANIKI_BOAT_ACCIDENT_MRUTHA_DEHALU_AV_TS10132 CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION (9000417593) ( ) ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం బోట్ ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి మృతదేహాలు వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం కడిపికొండలోని వారి స్వగృహలకు చేరుకున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో బస్కే అవినాష్, బస్కే రాజేందర్ మృతదేహలు మంగళవారం ఉదయం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గ్రామానికి చేరాయి. విహార యాత్రకు వెళ్లి విగత జీవులుగా వచ్చిన తమ వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. గ్రామస్తులంతా మూకుమ్మడిగా విలపించడం అందరిని కలచి వేసింది . కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరి వల్లా కాలేదు. ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇక ఆచూకీ తెలియకుండా పోయిన మిగిలిన ఏడు కుటుంబాల్లోనూ ఆందోళన మరింత పెరిగింది. గల్లంతైన తమవారి జాడ కోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు. విహారయాత్ర యాత్ర కోసం ఇదే గ్రామం నుండి వెళ్ళిన 14 మంది బోట్ ప్రమాదానికి గురయ్యారు. వారిలో 5 గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 9 మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.... మరో 7 మంది సమాచారం ఇప్పటి వరకూ లభించలేదు.
Last Updated : Sep 17, 2019, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.