ETV Bharat / state

కొవిడ్​ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్​

author img

By

Published : Jul 29, 2020, 12:50 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధరించారు. ఇందులో పలువురు పోలీసులతోపాటు డీఆర్​డివో కార్యాలయ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.

covid tests in warangal urban district
కొవిడ్​ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్​

రాష్ట్రంలో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధరించారు. ఇందులో పలువురు పోలీసులతోపాటు డీఆర్​డివో కార్యాలయ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.

కొవిడ్ నిర్ధరణ అయిన వారు హోమ్ ఐసోలేషన్​లో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 20 మందికి పరీక్ష చేయగా.. ఆరుగురికి వైరస్​ సోకింది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి కుటుంబ సభ్యులు, గన్ మెన్, డ్రైవర్​తోపాటు శాసనసభ్యులు వ్యక్తిగత సహాయకునికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

రాష్ట్రంలో పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధరించారు. ఇందులో పలువురు పోలీసులతోపాటు డీఆర్​డివో కార్యాలయ సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.

కొవిడ్ నిర్ధరణ అయిన వారు హోమ్ ఐసోలేషన్​లో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 20 మందికి పరీక్ష చేయగా.. ఆరుగురికి వైరస్​ సోకింది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి కుటుంబ సభ్యులు, గన్ మెన్, డ్రైవర్​తోపాటు శాసనసభ్యులు వ్యక్తిగత సహాయకునికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.