ETV Bharat / state

వరంగల్ నో మూమెంట్ జోన్​లో కఠినంగా లాక్​డౌన్

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా కేసులు అధికమవుతోన్న నేపథ్యంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో నో మూమెంట్​తో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

author img

By

Published : Apr 26, 2020, 2:02 PM IST

నో మూమెంట్ జోన్​లో పకడ్బందీ చర్యలు
నో మూమెంట్ జోన్​లో పకడ్బందీ చర్యలు

వరంగల్ అర్బన్ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు అధికారులు నో మూమెంట్ జోన్లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

తాజాగా వెలుగు చూసిన కేసులతో అధికారులు మరింత ముందుచూపుతో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, శాంతినగర్, శాలిని నగర్​లను జోన్​ల కింద ఏర్పాటు చేశారు. ఆయా కాలనీల నుంచి బయటకు ఎవరూ రాకుండా పోలీసులు రహదారులకు అడ్డంగా కంచెలను ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల కోసం నిత్యవసర వస్తువులను మున్సిపల్ సిబ్బంది అందజేస్తున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు అధికారులు నో మూమెంట్ జోన్లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

తాజాగా వెలుగు చూసిన కేసులతో అధికారులు మరింత ముందుచూపుతో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, శాంతినగర్, శాలిని నగర్​లను జోన్​ల కింద ఏర్పాటు చేశారు. ఆయా కాలనీల నుంచి బయటకు ఎవరూ రాకుండా పోలీసులు రహదారులకు అడ్డంగా కంచెలను ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల కోసం నిత్యవసర వస్తువులను మున్సిపల్ సిబ్బంది అందజేస్తున్నారు.

ఇవీ చూడండి : ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.