ETV Bharat / state

కాంగ్రెస్​ను అణగదొక్కడానికే.. నాటకాలు ఆడుతున్నారు: రేవంత్​రెడ్డి

author img

By

Published : Apr 26, 2021, 7:57 PM IST

ఎనిమిదేళ్లుగా వరంగల్​ను అభివృద్ధి చేయని తెరాస ప్రభుత్వం.. ఇప్పుడేం చేస్తాదని కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​ను రాజకీయంగా దెబ్బతీసేందుకు.. తెరాస, భాజపా కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు.

revanth reddy speaks on warangal development
తెరాస, భాజపాలపై రేవంత్​రెడ్డి ఆగ్రహం

కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. అన్ని అవకాశాలున్న వరంగల్​ను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వాన్ని.. భాజపా నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నేతలు.. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదులు చేసి.. చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవడం లేదో చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ను అణగదొక్కడానికి... తెరాస, భాజపాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​.. సమీక్షలు చేయడం లేదంటే అక్కడి పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని రేవంత్​ అన్నారు. ఎనిమిదేళ్లుగా వరంగల్​ను అభివృద్ధి చేయని.. తెరాస ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

తెరాస, భాజపాలపై రేవంత్​రెడ్డి ఆగ్రహం

ఇవీచూడండి: వరంగల్‌ను ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా మారుస్తాం: కిషన్​రెడ్డి

కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. అన్ని అవకాశాలున్న వరంగల్​ను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వాన్ని.. భాజపా నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నేతలు.. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదులు చేసి.. చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవడం లేదో చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ను అణగదొక్కడానికి... తెరాస, భాజపాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​.. సమీక్షలు చేయడం లేదంటే అక్కడి పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని రేవంత్​ అన్నారు. ఎనిమిదేళ్లుగా వరంగల్​ను అభివృద్ధి చేయని.. తెరాస ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

తెరాస, భాజపాలపై రేవంత్​రెడ్డి ఆగ్రహం

ఇవీచూడండి: వరంగల్‌ను ఫ్లడ్‌ ఫ్రీ సిటీగా మారుస్తాం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.