ETV Bharat / state

జలమయమైన ఓరుగల్లు... వరద నీటితో స్తంభించిన జనజీవనం

author img

By

Published : Aug 17, 2020, 4:44 AM IST

ఆక్రమణలు జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించారు. నాలాల్లో చెత్తచెదారం పేరుకుపోతున్నా పట్టించుకోలేదు. మురుగు పారే కాలువల పట్ల ఉదాసీనత కనబరిచారు. ఫలితంగా చారిత్రక నగరి ఓరుగల్లు జలమయమైంది. డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. రహదారులపైకి వరద పోటెత్తుతోంది. ఇళ్లల్లో మురుగుచేరి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Colonies submerged by heavy rains in Hanmakonda
జలమయమైన ఓరుగల్లు... వరద నీటితో స్తంభించిన జనజీవనం

రాజధాని హైదరాబాద్‌ తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న నగరం వరంగల్‌ . ఎడతెరిపి లేని వానలకు తడసిముద్దయింది. జిల్లా కేంద్రమైన హన్మకొండలో రహదారులు గుంతలమయంగా మారి తటాకాలను తలపిస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం విస్తృత ప్రణాళికలు రూపొందించినా... ఆచరణలో మాత్రం అధికారులు తరచూ విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆకర్షణీయ నగర హోదా పొందినా.... పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో... ఎక్కడ చూసినా చెత్తచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

ఉదాసీనతే కొంప ముంచింది

తాజాగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం పూర్తిగా జలమయమైంది. ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా వరదనీరే. నాలాలన్నీ నదులను తలపిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితము ఇదే రీతిలో నగరం జలమయమైంది. అస్తవ్యస్తంగా ఉన్న నాలాలకు మరమ్మతులు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. నాలాల చుట్టూ ఆక్రమణలు జరుగుతున్నా... వాటి తొలగింపులో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే చిన్నపాటి వర్షానికి సైతం నగరం బురదమయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులున్నా... పనులు సున్నా..

ప్రభుత్వం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఏటా కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేస్తోంది. పన్నుల రూపంలోనూ భారీగా ఆదాయం వస్తున్నా... భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై మాత్రం బల్దియా అధికారులు దృష్టిసారించడం లేదు. వరద నివారణపై శాశ్వత ప్రణాళికలు రచించడం లేదు. ఫలితంగా నాలుగు చినుకులు పడితే నగరం చిత్తడిగా మారుతోంది. భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. నాలాల్లో పేరుకుపోయే చెత్తచెదారాన్ని వేసవి ఆరంభంలోనే శుభ్రం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్

రాజధాని హైదరాబాద్‌ తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న నగరం వరంగల్‌ . ఎడతెరిపి లేని వానలకు తడసిముద్దయింది. జిల్లా కేంద్రమైన హన్మకొండలో రహదారులు గుంతలమయంగా మారి తటాకాలను తలపిస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం విస్తృత ప్రణాళికలు రూపొందించినా... ఆచరణలో మాత్రం అధికారులు తరచూ విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆకర్షణీయ నగర హోదా పొందినా.... పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో... ఎక్కడ చూసినా చెత్తచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

ఉదాసీనతే కొంప ముంచింది

తాజాగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం పూర్తిగా జలమయమైంది. ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా వరదనీరే. నాలాలన్నీ నదులను తలపిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితము ఇదే రీతిలో నగరం జలమయమైంది. అస్తవ్యస్తంగా ఉన్న నాలాలకు మరమ్మతులు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. నాలాల చుట్టూ ఆక్రమణలు జరుగుతున్నా... వాటి తొలగింపులో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే చిన్నపాటి వర్షానికి సైతం నగరం బురదమయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులున్నా... పనులు సున్నా..

ప్రభుత్వం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఏటా కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేస్తోంది. పన్నుల రూపంలోనూ భారీగా ఆదాయం వస్తున్నా... భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై మాత్రం బల్దియా అధికారులు దృష్టిసారించడం లేదు. వరద నివారణపై శాశ్వత ప్రణాళికలు రచించడం లేదు. ఫలితంగా నాలుగు చినుకులు పడితే నగరం చిత్తడిగా మారుతోంది. భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచివేయాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. నాలాల్లో పేరుకుపోయే చెత్తచెదారాన్ని వేసవి ఆరంభంలోనే శుభ్రం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి : రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.