వరంగల్ పట్టణ జిల్లా హసన్పర్తి మండలం నాగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విఘ్నేష్(14) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాశీబుగ్గకు చెందిన విఘ్నేష్, మరో ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నాగారం వద్ద ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ను తప్పించి వెళ్లే క్రమంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న విఘ్నేష్కు ట్రాక్టర్ తగిలింది.
దీంతో విఘ్నేష్ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా... వారిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హన్మకొండ నుంచి శనిగరం వెళ్తుండగా... ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవీ చూడండి: జాతీయ రహదారిపై లారీ బోల్తా..