ETV Bharat / state

'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలి' - వరంగల్​ అర్బన్​ జిల్లా తాజా వార్తలు

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించినప్పుడే అమరవీలకు నిజమైన శ్రద్ధాంజలి అర్పించినట్లని భాజపా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

'తెలంగాణ విమోజన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలి'
'తెలంగాణ విమోజన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలి'
author img

By

Published : Sep 7, 2020, 10:32 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా వరంగల్​ అర్బన్​జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్​ చేశారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే రాష్ట్రానికి సెప్టెంబరు 17న వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహిస్తామన్న తెరాస నేతలు​ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు.

తెలంగాణ చరిత్ర భవిష్యత్​ తరాలకు తెలియజేయడంలో ఈ వేడుక ఎంతో కీలక పాత్ర వహిస్తోందన్నారు. ప్రభుత్వం అధికారకంగా నిర్వహించేవరకు భాజపా ఉద్యమిస్తునే ఉంటుందని పేర్కొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా వరంగల్​ అర్బన్​జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్​ చేశారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే రాష్ట్రానికి సెప్టెంబరు 17న వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహిస్తామన్న తెరాస నేతలు​ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు.

తెలంగాణ చరిత్ర భవిష్యత్​ తరాలకు తెలియజేయడంలో ఈ వేడుక ఎంతో కీలక పాత్ర వహిస్తోందన్నారు. ప్రభుత్వం అధికారకంగా నిర్వహించేవరకు భాజపా ఉద్యమిస్తునే ఉంటుందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.