అయ్యప్ప శరణు ఘోషతో ఓరుగల్లు నగరం మారుమోగింది. ఉర్సు నాగేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, ప్రజలు హాజరయ్యారు.
పంచామృతాలతో పండల రాజ కుమారునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి రంగురంగుల పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ఇవీ చూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా?