ETV Bharat / state

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం

ఇద్దరు చిన్నారులు చెరువులో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన వరంగల్​లోని కీర్తినగర్​లో చోటుచేసుకుంది.

author img

By

Published : Jan 30, 2020, 3:15 PM IST

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం

ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు చెరువులో పడి మృతి చెందిన ఘటన వరంగల్​లో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కీర్తి నగర్​లోని కట్టమల్లన్న చెరువులో గరీబ్ నగర్​కు చెందిన ఆరేళ్ల రుచిత, తొమ్మిదేళ్ల ప్రణీత్ చెరువులో పడి దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టి.. చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.

అయితే మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చెరువు కట్ట ప్రమాదంగా ఉందని పలు మార్లు గీసుకొండ పోలీసులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని స్థానికులు తెలిపారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా పాఠశాలకు సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్థులు చెరువు కట్ట వద్ద ఆడుకుంటూ చెరువులో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:గ్యాంగ్ వార్​గా చిత్రీకరించినవారిపై కఠిన చర్యలు..

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు దుర్మరణం

ప్రమాదవశాత్తు ఇద్దరు పిల్లలు చెరువులో పడి మృతి చెందిన ఘటన వరంగల్​లో చోటుచేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా కీర్తి నగర్​లోని కట్టమల్లన్న చెరువులో గరీబ్ నగర్​కు చెందిన ఆరేళ్ల రుచిత, తొమ్మిదేళ్ల ప్రణీత్ చెరువులో పడి దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టి.. చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.

అయితే మరొకరు ఉన్నారన్న అనుమానంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చెరువు కట్ట ప్రమాదంగా ఉందని పలు మార్లు గీసుకొండ పోలీసులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని స్థానికులు తెలిపారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా పాఠశాలకు సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్థులు చెరువు కట్ట వద్ద ఆడుకుంటూ చెరువులో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:గ్యాంగ్ వార్​గా చిత్రీకరించినవారిపై కఠిన చర్యలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.