ETV Bharat / state

రహదారి దెబ్బతింది... కొత్తది నిర్మించండి - వరంగల్​ రూరల్​ జిల్లా ఔటర్​ రింగు రోడ్డు

వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​ మండలంలోని ఎల్కుర్తి గ్రామ ప్రజలు గ్రామానికి కొత్త రహదారి నిర్మించాలంటూ ఆందోళన బాట పట్టారు.

రహదారి నిర్మాణం
author img

By

Published : Jul 11, 2019, 2:58 PM IST

రహదారి నిర్మించాలంటూ గ్రామస్థుల ఆందోళన

ఔటర్​ రింగురోడ్డు నిర్మాణ పనుల కోసం తిరిగే లారీల వల్ల తమ గ్రామ ప్రధాన రహదారి దెబ్బతిందని వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​ మండలం ఎల్కుర్తి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్​అండ్​టీ కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంటు ముందు వారు ధర్నా చేశారు. ముడి పదార్థాలు తీసుకెళ్లే లారీలు అధిక లోడుతో ఉండడం వల్ల ప్రధాన రహదారి దెబ్బతిందని..తమ గ్రామానికి ఎల్​అండ్​టీ నిర్మాణ సంస్థే నూతన రహదారి వేయాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

కొత్త రహదారి నిర్మాణానికి అంగీకారం

రహదారి నిర్మాణం విషయంలో సంస్థ అధికారులకు, వారికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రోడ్డు నిర్మించడానికి సంస్థ అధికారులు అంగీకరించారు. ప్రారంభ సూచకంగా అధికారులు, గ్రామస్థులు కూడలి వద్ద కొబ్బరికాయలు కొట్టారు.

ఇదీ చూడండి : మంత్రి సమావేశంలో 'నిద్రలో జోగుతున్న' అధికారులు

రహదారి నిర్మించాలంటూ గ్రామస్థుల ఆందోళన

ఔటర్​ రింగురోడ్డు నిర్మాణ పనుల కోసం తిరిగే లారీల వల్ల తమ గ్రామ ప్రధాన రహదారి దెబ్బతిందని వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​ మండలం ఎల్కుర్తి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్​అండ్​టీ కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంటు ముందు వారు ధర్నా చేశారు. ముడి పదార్థాలు తీసుకెళ్లే లారీలు అధిక లోడుతో ఉండడం వల్ల ప్రధాన రహదారి దెబ్బతిందని..తమ గ్రామానికి ఎల్​అండ్​టీ నిర్మాణ సంస్థే నూతన రహదారి వేయాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

కొత్త రహదారి నిర్మాణానికి అంగీకారం

రహదారి నిర్మాణం విషయంలో సంస్థ అధికారులకు, వారికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రోడ్డు నిర్మించడానికి సంస్థ అధికారులు అంగీకరించారు. ప్రారంభ సూచకంగా అధికారులు, గ్రామస్థులు కూడలి వద్ద కొబ్బరికాయలు కొట్టారు.

ఇదీ చూడండి : మంత్రి సమావేశంలో 'నిద్రలో జోగుతున్న' అధికారులు

Intro:TG_WGL_11_11_ROAD_KOSAM_GRAMASTHULA_DHARNA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల కోసం తిరిగే లారీల వలన తమ గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిందని వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం ఎలుకుర్తిలో ఎల్ అండ్ టి కంపెనీ ఏర్పాటుచేసిన ప్లాంటు ముందు వారు ధర్నా నిర్వహించారు. ప్లాంట్ నుండి కంకర, ఇనుము, కాంక్రీట్ వంటి ముడి పదార్థాలను తీసుకువెళ్లే లారీలు అధిక బరువుతో వెళ్లడం వలన ప్రధాన రహదారి దెబ్బతిని పాఠశాలకు వెళ్లే పిల్లలు, సొంత పనులపై పక్క గ్రామాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టి కంపెనీ వారే తమ గ్రామంలో కొత్త రహదారిని వేయాలని గ్రామస్తులు ఆ సంస్థ అదికారులను డిమాండ్ చేశారు. నిర్మాణ సంస్థ అధికారులకు గ్రామస్తులకు మధ్య రోడ్డు నిర్మాణ విషయంలో కొంతసేపు వాగ్వాదం జరిగినప్పటికీ...... చివరకి ఈ గ్రామం నుండి నగరానికి వెళ్లే ప్రధాన రహదారిని కొత్తగా నిర్మించడానికి నిర్మాణ సంస్థ అధికారులు అంగీకరించారు. కొత్త రహదారి ప్రారంభ సూచకంగా సంస్థ అధికారులు, గ్రామస్తులు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద కొబ్బరికాయలు కొట్టారు.

bytes....

యాదగిరి, గ్రామపెద్ద.
రవీందర్, ఎంపీటీసీ.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION




Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.