ETV Bharat / state

శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు - nethaji subhash chandra bose birth anniversary

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు. ఉద్యమకారుల చరిత్ర భావి తరాలకు అందిచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు
శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు
author img

By

Published : Jan 23, 2020, 4:12 PM IST

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారి మీద పోరాడి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల చరిత్ర ఇప్పటి తరాలకు తెలియకుండా చేయడం వారిని అవమానించడమేనని ఆ పార్టీ నాయకుడు అరకొండ కొమురయ్య అన్నారు.

స్వతంత్ర సమరయోధులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను కేసులు పెట్టి నిర్బంధించడం ద్వారా కేసీఆర్‌ ప్రజాస్వామ్య ద్రోహిగా మారాడని అన్నారు. ప్రజాస్వామ్యవాదులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చింతల భాస్కర్, చిరంజీవి, వీవీ స్వామి పాల్గొన్నారు.

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారి మీద పోరాడి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల చరిత్ర ఇప్పటి తరాలకు తెలియకుండా చేయడం వారిని అవమానించడమేనని ఆ పార్టీ నాయకుడు అరకొండ కొమురయ్య అన్నారు.

స్వతంత్ర సమరయోధులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను కేసులు పెట్టి నిర్బంధించడం ద్వారా కేసీఆర్‌ ప్రజాస్వామ్య ద్రోహిగా మారాడని అన్నారు. ప్రజాస్వామ్యవాదులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చింతల భాస్కర్, చిరంజీవి, వీవీ స్వామి పాల్గొన్నారు.

ఇది చూడండి: 'పెద్ద' మనిషి మృగత్వం... బాలికపై అఘాయిత్యం

TG_WGL_42_23_NETAJI_AV_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రురల్ జిల్లా శాయంపేట మండలం తెలంగాణ ఇంటి పార్టీ అద్వర్యం లో దేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌరస్తాలో పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వతంత్రం లో స్వతంత్ర పోరాటంలో రాజ్యంతో పోరాటం చేసి మనకు స్వాతంత్రం రావాలని బ్రిటిష్ వారి మీద తెల్ల దొరల మీద ప్రాణ త్యాగాలతో పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం సుభాష్ చంద్రబోస్ అందించారు. ఇలాంటి గొప్ప మేధావులు నాయకులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి తమ జీవితాలు త్యాగం చేసినారు .వీరి త్యాగాన్ని మనదేశంలో పక్కదారి పట్టించి,ఇంత గొప్ప వ్యక్తులను మన దేశం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను మేధావులను ఉద్యమకారుల పేరు ఈ తరానికి తెలియకుండా చేయడం వారిని అవమానపరచడ మే తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు అరకొండ కొమురయ్య అన్నారు. ఇలాంటి పనులు మన దేశానికి సిగ్గుచేటని అన్నారు. . స్వాతంత్ర సమరయోధులను ఇప్పటికైనా ముందుకు తీసుకురావాలని కోరారు. ఇదేవిధంగా గా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు మన రాష్ట్రంలో అన్యాయము జరుగుతున్నది అని అన్నారు.దేశం కోసం పోరాటం చేసిన నాయకులకు ఎట్లా అన్యాయం జరిగిందో అదే విధంగా రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు అదేవిధంగా కెసిఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుదని, ఉద్యమకారులను మేధావులను ప్రొఫెసర్లను నిర్బంధించి కేసులు పెట్టించడం చంపేయడం ద్వారా కెసిఆర్ ప్రజాసామ్య ద్రోహిగా మారాడని అన్నారు. ప్రజలు అన్యాయాలను గమనించి ప్రజాస్వామ్యాన్ని ఉద్యమకారులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు చింతల భాస్కర్ చిరంజీవి వి.వి స్వామి రాజు రమేష్ డేవిడ్ రాజు శీను ను ను దేవన్న తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.