ETV Bharat / state

పరకాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి

author img

By

Published : Nov 5, 2020, 6:12 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలును పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్మి లాభాలు పొందాలని ఆయన రైతులను కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దవి సూచించారు.

MLA Challa Dharmareddy started buying cotton in Parakala
పరకాలలో పత్తి కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి పంటను అమ్మి లాభాలు పొందాలని పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి కోరారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సీాసీఐ ద్వారా పత్తి కొనుగోలును ఆయన ప్రారంభించారు.

రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్మి రూ.5,800/- మద్దతు ధర తీసుకోవాలన్నారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
పత్తిలో తేమ 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోతుందని.. కాబట్టి రైతులు తేమ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చల్లా సూచించారు.

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి పంటను అమ్మి లాభాలు పొందాలని పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి కోరారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సీాసీఐ ద్వారా పత్తి కొనుగోలును ఆయన ప్రారంభించారు.

రైతులు ఈ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్మి రూ.5,800/- మద్దతు ధర తీసుకోవాలన్నారు. దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
పత్తిలో తేమ 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోతుందని.. కాబట్టి రైతులు తేమ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చల్లా సూచించారు.

ఇవీ చదవండి: 'ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.